కరోనాను తక్కువ అంచనా వేస్తే వినాశనమే.. భారత్ పరిస్థితులే నిదర్శనం: డబ్ల్యూహెచ్ వో
- దానిని ఎదుర్కొనే శక్తి భారత్ కు ఉందన్న సంస్థ అధిపతి
- టీకా కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచన
- మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి
వైరస్ ఎంతటి వినాశనం సృష్టించగలదో భారత్ లోని పరిస్థితులే చెబుతున్నాయన్నారు. కరోనా టెస్టింగ్, పాజిటివ్ వచ్చినవాళ్లను కలిసిన వారి జాడ కనిపెట్టడం (ట్రేసింగ్), చికిత్స అందించడం (ట్రీటింగ్) వంటి పద్ధతులను అనుసరించాలని సూచించారు. టీకా కార్యక్రమాలను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతి తెలియజేశారు.