జర్నలిస్టులకు బస్ పాసులను కూడా దూరం చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే: నాదెండ్ల మనోహర్
- అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ సక్రమంగా లేదు
- వేలాది మంది పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వలేదు
- హెల్త్ కార్డులు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు
కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి జర్నలిస్టులు రిపోర్టింగ్ చేస్తున్నారని... వారి ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించాల్సి ఉందని మనోహర్ సూచించారు. హెల్త్ కార్డులు లేకపోవడంతో కరోనా బారిన పడిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రుల్లో చేరి ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు పాత్రికేయులు, వారి కుటుంబసభ్యులు ఇప్పటికే కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. జర్నలిస్టులను ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి వారికి చేయూతను అందించాలని డిమాండ్ చేశారు.