telangana: తెలంగాణలో పంజా విసురుతున్న కరోనా.. తాజా వివరాలు!

3052 new corona cases registers in Telangana
  • గత 24 గంటల్లో 3,052 కొత్త కేసులు
  • రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురి మృతి
  • రాష్ట్రంలో ప్రస్తుతం 24,131 యాక్టివ్ కేసులు
తెలంగాణలో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. రోజువారీ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,052 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 778 మంది కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 406 కేసులు నమోదయ్యాయి. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నుంచి 3,06,678 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,131 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో భారత్ లో 1.61 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.
telangana
Corona Virus
updates

More Telugu News