మోదీ హద్దులు దాటి మాట్లాడుతున్నారు: మమతా బెనర్జీ
- ఇలాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదు
- అమెరికాకు వెళ్లి ట్రంప్ కార్డు వాడారు.. ఇప్పుడు బెంగాల్ కార్డు వాడుతున్నారు
- బీజేపీ మాటనే ఈసీ వింటోంది
జీజేపీ నేతలు చెపుతున్న మాటలనే ఎన్నికల కమిషన్ వింటోందని మమత ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మాటలనే కాకుండా, అందరి మాటలను వినాలని ఎన్నికల సంఘాన్ని చేతిలెత్తి కోరుతున్నానని అన్నారు. ఎన్నికల సంఘానికి పక్షపాతం ఉండకూడదని చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు బెంగాల్ లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని... అలాంటి వాళ్లను జైళ్లలో పెట్టాలని అన్నారు. రాజకీయాల నుంచి అలాంటి వాళ్లను తొలగించాలని మండిపడ్డారు. కాంగ్రెస్, వామపక్షాలు బీజేపీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.