భారత తదుపరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సుశీల్ చంద్ర
- రేపటితో ముగియనున్న సునీల్ అరోరా పదవీ కాలం
- సుశీల్ చంద్ర పేరును ఖరారు చేసిన ప్రభుత్వం!
- సుశీల్ హయాంలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు
లోక్సభ ఎన్నికలకు ముందు 14 ఫిబ్రవరి 2019న సుశీల్ చంద్ర ఎన్నికల కమిషనర్గా నియమితుయ్యారు. 14 మే 2022 వరకు ఆయన నిర్వచన్ భవన్ చీఫ్గా కొనసాగుతారు. సుశీల్ హయాంలో గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో ఆయా ప్రభుత్వాల పదవీ కాలం ముగుస్తుంది.
కాగా, 1980 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన సుశీల్ చంద్ర ఎన్నికల కమిషనర్గా నియమితులు కావడానికి ముందు సీబీడీటీ చైర్మన్గా పనిచేశారు. నోట్ల రద్దు సమయంలో కీలకంగా పనిచేశారు.