యోగి, షాలను చంపేందుకు 11 మంది ఆత్మాహుతి బాంబర్లు రెడీగా ఉన్నారు: అజ్ఞాతవ్యక్తి ఈ-మెయిల్
- ముంబై సీఆర్పీఎఫ్ కార్యాలయానికి ఈ-మెయిల్
- ప్రార్థనా మందిరాల వద్ద విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిక
- యోగి, షాలకు భద్రత పెంపు
ముంబై సీఆర్పీఎఫ్ కార్యాలయానికి వచ్చిన ఈ లేఖలో... యోగి, షాలను మట్టుబెట్టేందుకు11 మంది ఆత్మాహుతి బాంబర్లు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నాడు. లేఖతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిద్దరికీ భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. కేసు నమోదు చేసుకుని లేఖ ఎక్కడి నుంచి వచ్చిందీ ఆరా తీస్తున్నారు.