రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం.. ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
- బీటెక్ చదివి చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తుండడంతో మనస్తాపం
- పెళ్లి చేసుకుని వ్యవసాయం చేసుకోవాలన్న తల్లిదండ్రులు
- బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడు
ఇటీవల స్వగ్రామం వెళ్లిన మహేందర్ను తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చేలా లేదని, పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకోవాలని సూచించారు. దీంతో మరింత మనస్తాపానికి గురైన మహేందర్ సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.