Encounter: చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్... ఐదుగురు భద్రతా సిబ్బంది మృతి

Huge encounter in Chattisgarh
షార్ట్స్‌లో చూడండి
దేశంలో మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో చత్తీస్ గఢ్ ఒకటి. తాజాగా రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. బిజాపూర్ అటవీప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. బిజాపూర్-సుక్మా అటవీప్రాంతంలో భద్రతా బలగాలు యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహించాయి. పోలీసుల రాకతో అప్రమత్తమైన మావోలు కాల్పులు జరపడంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో భద్రతాబలగాల వైపు ప్రాణనష్టం అధికంగా ఉంది. ఐదుగురు జవాన్లు మృతి చెందగా, మరికొందరు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోలు మృతి చెందినట్టు భావిస్తున్నా, దీనిపై స్పష్టత లేదు. కాగా, మావోల ఉనికి వెల్లడి కావడంతో ఈ ప్రాంతానికి భారీగా అదనపు బలగాలను తరలిస్తున్నారు.
Go Back to Shorts
Encounter
Chattisgarh
Security Personnel
Death
Naxals

More Telugu News