జనతా కర్ఫ్యూకి నేటితో సరిగ్గా ఏడాది పూర్తి!
- గత ఏడాది మార్చి 22న జనతా కర్ఫ్యూ అమలు
- మే 31 వరకు కొనసాగిన లాక్ డౌన్
- ఏడాది తర్వాత పలు చోట్ల లాక్ డౌన్లు, నైట్ కర్ఫ్యూలు
గత మార్చి 22న మొదలైన లాక్ డౌన్ అలాగే కొనసాగుతూ మే 31 వరకు కొనసాగింది. ఆ తర్వాత విడతల వారీగా లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ వచ్చారు. మరోవైపు ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ కలకలం రేపుతున్నాయి. లాక్ డౌన్ విధించి ఏడాది పూర్తయిన సమయంలో... దేశంలో పలు చోట్ల మళ్లీ లాక్ డౌన్లు, రాత్రి కర్ఫ్యూలు కొనసాగుతుండటం గమనార్హం.
గత 24 గంటల్లో 46,951 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 21,180 మంది కోలుకున్నారు. కోలుకుంటున్న వారి కంటే ఎక్కువ కేసులు నమోదు కావడం ఇది వరుసగా 12వ రోజు.