తాడిపత్రిలో రసవత్తరంగా చైర్మన్ ఎన్నిక.. టీడీపీ, వైసీపీలకు సమానబలం
- టీడీపీ 18, వైసీపీ 16 వార్డుల్లో గెలుపు
- ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో ఓట్లు వేయలేరన్న అధికారి
- ఎమ్మెల్యేల ఓటుతో ఇరు పార్టీల బలాలు సమానం
- కీలకంగా మారిన స్వతంత్ర, సీపీఐ అభ్యర్థులు
అయితే, ఎమ్మెల్యే, ఎంపీలు మాత్రం ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు అర్హులని చెప్పడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య ఓట్లతో వైసీపీ బలం 18కి పెరిగింది. టీడీపీ బలం కూడా 18 కావడంతో ఇరు పార్టీల బలాలు సమానమయ్యాయి. దీంతో ఇక్కడి నుంచి గెలిచిన సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరిపైకి అందరి దృష్టి మళ్లింది. ఇప్పుడు వీరిద్దరు ఎటువైపు నిలిస్తే వారికే చైర్మన్ పీఠం దక్కుతుంది. మరోవైపు, ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు టీడీపీ తమ కౌన్సిలర్లు అందరినీ ప్రత్యేక శిబిరానికి తరలించింది.