Andhra Pradesh: ఏపీలో కొత్తగా 147 కరోనా కేసులు.. పూర్తి వివరాలు!

  • 24 గంటల్లో 22,604 మందికి కోవిడ్ టెస్టులు
  • కర్నూలు జిల్లాలో ఒకరి మృతి
  • రాష్ట్రంలో 1,443 యాక్టివ్ కేసులు
Andhra Pradesh reports 147 new COVID19 cases

ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 22,604 మందికి కరోనా టెస్టులను నిర్వహించగా 147 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 35 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కో కేసు వంతున నిర్ధారణ అయ్యాయి.

ఇక కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇదే సమయంలో 103 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,443 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 7,185 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,92,008 కేసులు నమోదు కాగా... 8,83,380 మంది కోలుకున్నారు.  

More Telugu News