Andhra Pradesh: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

Municipal elections polling ends in Andhara Pradesh
  • ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగిన పోలింగ్
  • క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం
  • 14వ తేదీన వెలువడనున్న ఫలితాలు
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. అక్కడక్కడ స్వల్ప ఘటనలు మినహా అన్ని చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 5 గంటలకు ముగిసింది. అయితే, అప్పటికే క్యూలైన్లలో ఉన్నవారికి మాత్రం ఎంత సేపైనా ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. ఈ నెల 14న కౌంటింగ్ జరగనుంది. అన్ని పార్టీలు గెలుపు కోసం తమ సర్వ శక్తులను ఒడ్డడంతో ఫలితాలు ఎలా వస్తాయనే దానిపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా విశాఖ, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  

మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53.57 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 59.93 శాతం పోలింగ్ నమోదు కాగా... చిత్తూరు జిల్లాలో అత్యల్పంగా 54.12 శాతం నమోదైంది.
Andhra Pradesh
Municipal Elections

More Telugu News