ఏపీ మునిసిపల్ ఎన్నికలు.. తొలి రోజు 222 ఏకగ్రీవాలు
- ఉపసంహరణ తర్వాత 221 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు
- కొవ్వూరులోని ఒకే ఒక్క వార్డులో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం
- నేడు అధికారకంగా ప్రకటించే అవకాశం
- కడపలో అత్యధికంగా 100 స్థానాల్లో ఏకగ్రీవం
కడప జిల్లాలో అత్యధికంగా 100 డివిజన్ లు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో పులివెందుల మునిసిపాలిటీలో మొత్తం 33 వార్డులలోను ఒక్కటి చొప్పున నామినేషన్లు మిగిలాయి. ఇక, చిత్తూరులో 37, కర్నూలులో 36, అనంతపురం జిల్లాలో 13 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే నెల్లూరు జిల్లాలో 11 డివిజన్, వార్డు సభ్యుల స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సింగిల్ డిజిట్లోనే ఏక్రగీవాలు అయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం కానున్నారు.