కేజ్రీవాల్ కు భద్రత కుదింపు... అటువంటిది లేదన్న హోమ్ శాఖ!

Home ministry Responds on Kejriwal Security Cut
  • నేడు సూరత్ లో కేజ్రీవాల్ భారీ ర్యాలీ
  • ఆరుగురు కమాండోలను రెండుకు తగ్గించారన్న ఆప్
  • సాధారణ మార్పులో భాగమేనన్న హోమ్ శాఖ
  • భద్రత తగ్గించలేదని స్పష్టీకరణ
తమ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భద్రతను కుదించారని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు ఆరోపిస్తుండగా, కేంద్ర హోమ్ శాఖ మాత్రం ఆ ఆరోపణలను కొట్టేసింది. గుజరాత్ లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో, ముఖ్యంగా సూరత్ లో ఆప్ చెప్పుకోతగ్గ స్థానాలను గెలుపొందిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో నేడు కేజ్రీవాల్ ప్రత్యేకంగా సూరత్ లో పర్యటించి, ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలని భావించారు. ఇందుకోసం ప్రత్యేక ర్యాలీని సైతం ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఈ ర్యాలీకి బందోబస్తుగా ఉండాల్సిన పోలీసుల సంఖ్యను ప్రభుత్వం కుదించింది.

ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం నుంచి వచ్చిన సంకేతాలతోనే భద్రతను కుదించారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్ కు భద్రతగా ఆరుగురు కమాండోలు ఉండాలని, కానీ ఆ సంఖ్యను రెండుకు తగ్గించారన్నది వారి ఆరోపణ. దీనిపై హోమ్ శాఖ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ, తామేమీ భద్రతను తగ్గించలేదని, సాధారణ మార్పుల్లో భాగంగా నలుగురు కమాండోలను మార్చామని, ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతూనే ఉందని అన్నారు.
Go Back to Shorts
Arvind Kejriwal
Security
Z Plus
Home Ministry

More Telugu News