చైనాకు ఝలక్.. రెండో దశలో ఆ దేశ టీకాలు వాడబోమన్న శ్రీలంక

Sri Lanka Refused to Use China Vaccine
  • 5 లక్షల డోసుల టీకాలను ఉచితంగా ఇచ్చిన భారత్
  • కోవాక్స్ కార్యక్రమంలో 35 లక్షల డోసులు
  • మూడో దశ ప్రయోగ పత్రాలను చైనా అందించలేదన్న శ్రీలంక
పొరుగుదేశం శ్రీలంకకు భారతదేశం ఇటీవల 5 లక్షల డోసుల కరోనా టీకాలను ఉచితంగా అందించింది. దీంతో ఆ దేశంలో టీకా తొలి డోసు పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఆ తర్వాత సీరం ఇనిస్టిట్యూట్ నుంచి కోటి డోసుల ఆస్ట్రాజెనెకా టీకాను ఆ దేశం కొనుగోలు చేసింది. ‘కోవ్యాక్స్’ కార్యక్రమం కింద అదనంగా 35 లక్షల డోసుల టీకాలు శ్రీలంకకు లభించాయి. వీటితో తొలి దశ టీకా పంపిణీని ఆ దేశం పూర్తి చేసింది. త్వరలో రెండో దశ పంపిణీకి సమాయత్తం అవుతోంది.

అయితే, ఈ దశలో చైనా వ్యాక్సిన్‌ను వాడేది లేదని శ్రీలంక స్పష్టం చేసింది. టీకా మూడో దశ ప్రయోగాలకు సంబంధించిన పత్రాలను చైనా సమర్పించలేదని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీలంక ఉద్యానవనశాఖ మంత్రి రమేశ్ పథిరణ తెలిపారు. చైనా, రష్యా టీకాలు ఇంకా సిద్దం కాకపోవడంతో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను మాత్రమే వినియోగిస్తామని చెప్పారు. వైద్య నిపుణుల సూచన మేరకు రెండో విడత ఎప్పుడు ప్రారంభించేదీ చెబుతామన్నారు.
Go Back to Shorts
China Vaccine
Sri Lanka
India
Russia
Astrazeneca

More Telugu News