కాశీబుగ్గ ఎస్సై శిరీషకు ప్రశంసాపత్రం అందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్
- యాచకుడి శవాన్ని మోసిన ఎస్సై శిరీష
- మహిళా ఎస్సైకి ప్రజలు, మీడియా నీరాజనాలు
- స్వయంగా బ్యాడ్జి తొడిగిన డీజీపీ సవాంగ్
- ఇతర పోలీసులకు స్ఫూర్తి కలిగించావని అభినందనలు
ఈ నేపథ్యంలో ఎస్సై శిరీషను రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా అభినందించారు. తన కార్యాలయానికి శిరీషను ఆహ్వానించడమే కాదు, ఆమెకు ప్రశంసాపత్రం కూడా అందజేశారు. గౌరవ బ్యాడ్జిని కూడా తొడిగారు. ఇతర పోలీసులకు స్ఫూర్తిగా నిలిచావంటూ కొనియాడారు. ఈ కార్యక్రమానికి పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.