ఎల్ఏసీ వద్ద చైనా తోక జాడిస్తే దీటుగా బదులిస్తాం: భారత వాయుసేన చీఫ్
- జోధ్ పూర్ లో భారత్, ఫ్రాన్స్ సంయుక్త వైమానిక విన్యాసాలు
- మీడియాతో మాట్లాడిన భారత వాయుసేన చీఫ్
- చైనా దూకుడుకు దూకుడుతోనే బదులిస్తామన్న భదౌరియా
- త్వరలో మరో 3 రాఫెల్ విమానాలు వస్తున్నాయని వెల్లడి
భారత వాయుసేనను మరింత బలోపేతం చేసేలా ఇప్పటికే 8 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కు చేరుకున్నాయని, మరో మూడు విమానాలు జనవరి చివరినాటికి వస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. చైనాతో గాల్వన్ లోయ ఘర్షణల తర్వాత నెలకొన్న పరిస్థితుల్లో రాఫెల్ భారత్ అమ్ములపొదిలో చేరడంతో గగనతలంలో వ్యూహాత్మక ఆధిపత్యం లభించినట్టయింది.