సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ... సీఎం జగన్ ఆస్తుల కేసులో కీలక నిర్ణయం తీసుకున్న కోర్టు
- కొనసాగుతున్న సీఎం జగన్ ఆస్తుల కేసుల విచారణ
- ఇవాళ విచారణ చేపట్టిన సీబీఐ-ఈడీ కోర్టు
- మొదట సీబీఐ చార్జిషీట్ల సంగతి తేల్చాలన్న సీఎం జగన్ న్యాయవాదులు
- తాము ఈడీ కేసులే మొదట విచారిస్తామన్న కోర్టు
సీబీఐ చార్జిషీట్ల సంగతి తేలిన తర్వాతే ఈడీ కేసులు విచారించాలని జగన్ న్యాయవాదులు కోర్టును కోరారు. అందుకు కోర్టు నిరాకరించింది. సీబీఐ అభియోగాలకు, ఈడీ అభియోగాలకు సంబంధంలేదని, ఈడీ కేసులనే తాము ముందుగా విచారిస్తామని స్పష్టం చేసింది. ఈడీ కేసుల్లో అభియోగాల నమోదు కోసం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.