వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి నగదు వద్దనుకుంటే ల్యాప్ టాప్ ఇస్తాం: సీఎం జగన్ ప్రకటన
- ఇవాళ అమ్మఒడి రెండో విడత నిధుల విడుదల
- నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్
- ల్యాప్ టాప్ ల కోసం రివర్స్ టెండరింగ్ పిలుస్తామని వెల్లడి
- అత్యాధునిక ఫీచర్లున్న ల్యాప్ టాప్ లు ఇస్తామని వివరణ
అయితే దీనికి రివర్స్ టెండరింగ్ పిలిస్తే మరింత ధర తగ్గే అవకాశం ఉందని సీఎం జగన్ వివరించారు. కాగా, ప్రభుత్వం అందించే ప్రతి ల్యాప్ టాప్ లో 4 గిగాబైట్ రామ్, విండోస్ ఓఎస్, ఇతర ఆధునిక సౌకర్యాలు ఉండేలా చూస్తున్నామని పేర్కొన్నారు. కరోనా సమయంలో విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తే పేదింటి పిల్లలు ఆ సౌకర్యానికి దూరమయ్యారని, అందుకే ల్యాప్ టాప్ లు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ అన్నారు.