కేసీఆర్ ఆరోగ్యానికి ఢోకా లేదు... విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది: డాక్టర్ ఎంవీ రావు
- కేసీఆర్ కు ఊపిరితిత్తుల్లో మంట
- యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు
- మీడియాకు వివరాలు తెలిపిన వ్యక్తిగత వైద్యుడు
- రెగ్యులర్ చెకప్ చేయించుకున్నారని వెల్లడి
- ఎమ్మారై స్కానింగ్ అవసరంలేదని స్పష్టీకరణ
ఏటా క్రమం తప్పకుండా చేయించుకునే మెడికల్ టెస్టులనే సీఎం కేసీఆర్ ఇవాళ కూడా చేయించుకున్నారని, ఆరోగ్యపరంగా ఆందోళన చెందాల్సిన అంశాలేవీ లేవని వెల్లడించారు. ముఖ్యంగా ఆయనలో కరోనా లక్షణాలు లేవని వివరించారు. సీటీ స్కాన్ చేశామని, ఆ నివేదిక రేపు వస్తుందని తెలిపారు. కేసీఆర్ కు ఎమ్మారై స్కానింగ్ అవసరంలేదని, ఆయన విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తెలిపారు.