రోహిత్ శర్మ సహా ఐదుగురికీ కరోనా నెగటివ్: బీసీసీఐ
- న్యూ ఇయర్ సందర్భంగా రెస్టారెంట్కు వెళ్లిన భారత ఆటగాళ్లు
- బయోబబుల్ను ఉల్లంఘించారంటూ ఐసోలేషన్కు తరలింపు
- తాజా పరీక్షల్లో ఆటగాళ్లు సహా జట్టు సహాయక సిబ్బందికి నెగటివ్
ఐసోలేషన్లో ఉన్న ఈ ఐదుగురు ఆటగాళ్లకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ రిపోర్టులు వచ్చినట్టు బీసీసీఐ పేర్కొంది. జట్టు సహాయక సిబ్బందికి కూడా కరోనా నెగటివ్ అనే రిపోర్టులు వచ్చినట్టు వివరించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు రెండు మ్యాచుల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్లో గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి.