ఆ సమయంలో హోమంలో ఉన్నా.. సుబ్బయ్య హత్యతో నాకు సంబంధం లేదు: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రాధ
- ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య హత్య
- ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ లపై ఆరోపణలు
- సుబ్బయ్య వస్తే ఎదురు చూడమని మాత్రమే చెప్పానన్న రాధ
ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ రాధ మాట్లాడుతూ, సుబ్బయ్య హత్యతో తనకు సంబంధం లేదని అన్నారు. ఉద్దేశ పూర్వకంగానే ఆయన కుటుంబసభ్యులు తన పేరును ప్రస్తావిస్తున్నారని చెప్పారు. హత్య జరిగిన సమయంలో తాను హోమంలో ఉన్నానని... అక్కడకు సుబ్బయ్య వస్తే కాసేపు ఎదురుచూడమని మాత్రమే చెప్పానని అన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని చెప్పారు.