మూడు రోజుల పర్యటనకు ఏపీకి రానున్న ఉప రాష్ట్రపతి

Venkaiah Naidu coming to AP for 3 days visit
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీ పర్యటనకు రానున్నారు. మూడు రోజుల పాటు విజయవాడలో ఆయన పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 27న ఆయన విజయవాడకు వస్తారు. మధ్యాహ్నం 4 గంటలకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ రాత్రికి స్వర్ణ భారత్ ట్రస్ట్ లో బస చేస్తారు. 28న సూరంపల్లిలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో జరిగే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. 29వ తేదీన గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.
Go Back to Shorts
Venkaiah Naidu
Andhra Pradesh
Tour

More Telugu News