యాప్ లోన్ వ్యవహారంలో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు... ఇప్పటివరకు 11 మంది అరెస్ట్
- యాప్ ల ద్వారా తక్షణ రుణాలంటూ ప్రలోభాలు
- ఆపై అధిక వడ్డీలతో వేధింపులు
- ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న బాధితులు
- ఢిల్లీలో ఐదుగురు, హైదరాబాదులో ఆరుగురు అరెస్ట్
- ఏపీలో స్పెషల్ డ్రైవ్ లు చేపడతామన్న డీజీపీ
ఢిల్లీలో ఐదుగురిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు, హైదరాబాదులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ యాప్ లోన్ సంస్థలకు చెందిన 2 టెలికాలర్ విభాగాల్లో సోదాలు చేసి 11 మందిని అరెస్ట్ చేసినట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి సునీల్ లోన్ యాప్ ల సిబ్బంది వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసు శాఖ ఈ యాప్ లపై తీవ్రస్థాయిలో దృష్టి సారించింది.
ఇదే అంశంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా స్పందించారు. బాధితులు ధైర్యంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. నోయిడా, ఢిల్లీ, గుర్గావ్ ల నుంచి ఈ మనీ లోన్ యాప్ లు నిర్వహిస్తున్నట్టు తెలిసిందని చెప్పారు. మొబైల్ లోన్ యాప్ ల వ్యవహారంలో ఏపీ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ లు చేపడుతున్నామని వెల్లడించారు.