డ్రోన్ ను ప్రయోగించిన పాక్... గుళ్లవర్షం కురిపించిన భారత సరిహద్దు భద్రతా దళం

Drone from Pakistan drops grenades box near border
  • సరిహద్దుల్లో పాక్ దుశ్చర్యలు
  • ఆయుధాలతో కూడిన డ్రోన్ ను పంపిన వైనం
  • కాల్పుల నుంచి తప్పించుకున్న డ్రోన్
  • నేలపైకి జారవిడిచిన పెట్టెలో గ్రనేడ్లు
  • స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు
సరిహద్దుల వద్ద పాకిస్థాన్ దుశ్చర్యలు అన్నీఇన్నీ కావు. తాజాగా పాక్ తన భూభాగం పైనుంచి భారత్ లోకి ఓ డ్రోన్ ను ప్రయోగించింది. శనివారం రాత్రి గ్రనేడ్లతో కూడిన డ్రోన్ ను పంపింది. ఈ డ్రోన్ ను గుర్తించిన భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) దానిపై తూటాల వర్షం కురిపించింది. అయితే ఆ డ్రోన్ తప్పించుకోవడంతో బీఎస్ఎఫ్ అధికారులు పంజాబ్ పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు కాల్పులు జరిపినా ఆ డ్రోన్ ను కూల్చలేకపోయారు. పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా సరిహద్దుల వద్ద ఈ ఘటన జరిగింది.

అయితే, డ్రోన్ జారవిడిచిన ఓ పెట్టెను గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది 11 హ్యాండ్ గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రనేడ్లను పాకిస్థాన్ లోని రావల్పిండిలో ఉన్న ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారుచేసినట్టు భావిస్తున్నారు. భారత్ లోకి ఇలాంటి ఆయుధాలను అక్రమ రవాణా చేసే ప్రయత్నం జరగడం గడచిన 15 నెలల్లో ఇది ఎనిమిదోసారి అని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Drone
Pakistan
Grenades
BSF
Punjab

More Telugu News