suicide: యువకుడి వేధింపులు తాళలేక.. 10వ తరగతి బాలిక ఆత్మహత్య

10th class student commits suicide
  • గుంటూరు జిల్లాలోని మేడికొండూరు మండలంలో ఘటన
  • పరారీలో నిందితుడు
  • పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు
ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధిస్తుండడంతో పదో తగరతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని మేడికొండూరు మండలం కొర్రపాడులో జరిగింది. స్థానికంగా ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోన్న విద్యార్థిని సౌమ్యను వరప్రసాద్‌ అనే యువకుడు కొంత కాలంగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు.

దీంతో సౌమ్య పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఓ యువకుడు తనను వేధిస్తున్నాడని, ఆ వేధింపులు ఇక భరించలేనంటూ, వరప్రసాద్ వల్లే తాను చనిపోతున్నానంటూ ఆ బాలిక ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రూపంలో చెప్పింది. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోన్న సమయంలో ఈ వీడియో తీశారు. తనను వేధించిన యువకుడిని కఠినంగా శిక్షించాలని ఆ బాలిక కోరింది.

అనంతరం ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. వర ప్రసాద్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. సౌమ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పరామర్శించారు.



suicide
Crime News
Guntur District

More Telugu News