ఉచితాల పేరుతో ఈ దగా జరుగుతూనే ఉంటుంది: కేటీఆర్ ప్రకటనపై ఐవైఆర్ విమర్శలు
- హైదరాబాద్లో వచ్చేనెల నుంచి ఉచిత తాగునీటి సరఫరా
- నిన్న ప్రకటన చేసిన కేటీఆర్
- రాజకీయ నాయకుడిని అర్థం చేసుకునే ప్రజలు లేనంతవరకు ఇలాగే చేస్తారన్న ఐవైఆర్
‘మీ నుంచి భారం కాని నీటి తీరువా వసూలు చేస్తాం. బాటిల్ నీళ్లతో అవసరం లేని మంచినీరు సరఫరా చేస్తాం. వసూలు చేసిన ప్రతి రూపాయి ఏ విధంగా ఖర్చు పెట్టింది తెలియజేస్తాం.. అని చెప్పే రాజకీయ నాయకుడిని అర్థం చేసుకునే ప్రజలు లేనంతవరకు, ఉచితాల పేరుతో ఈ దగా జరుగుతూనే ఉంటుంది’ అని ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు.