కళ్లు తిరిగి రైల్వే ట్రాక్ పై పడిపోయిన మహిళ.. కాపాడిన పోలీసు... వీడియో వైరల్
- ముంబయిలో ఘటన
- కుటుంబ సభ్యులతో ప్లాట్ ఫాంపై వేచి ఉన్న మహిళ
- పట్టాలపైకి ఒరిగిపోయిన వైనం.. అదే సమయంలో రైలు రాక
- తెగించి పట్టాలపైకి దూకిన కానిస్టేబుల్ శ్యామ్
- మహిళను కాపాడి, ప్లాట్ ఫాంపైకి చేర్చిన కానిస్టేబుల్
అయితే, శ్యామ్ సూరత్ అనే రైల్వే పోలీసు వెంటనే స్పందించి ప్లాట్ ఫాంపై నుంచి పట్టాలపైకి దూకి అతి కష్టం మీద ఆ మహిళను తిరిగి ప్లాట్ ఫాంపైకి చేర్చారు. దాంతో పెనుప్రమాదం తప్పినట్టయింది. రైలు వస్తున్నా వెనుకాడకుండా మహిళను రక్షించిన కానిస్టేబుల్ శ్యామ్ సూరత్ ను అందరూ అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.