అలాగైతే వైసీపీ, టీఆర్ఎస్‌ ప్రభుత్వాలు వెంటనే ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి: ఐవైఆర్

iyr slams ap telangana govts
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తోన్న భారత్ బంద్‌లో దేశ వ్యాప్తంగా రైతులు, పలు పార్టీల నేతలు, వ్యాపారులు పాల్గొంటోన్న విషయం తెలిసిందే. ఈ బంద్‌కు మద్దతు ఇస్తున్నామంటూ తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ చేసిన ప్రకటనలపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.

‘భారత్ బంద్ కు టీఆర్ఎస్ వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించాయి. దీని అర్థం ఈ పార్టీలు వ్యవసాయ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నాయా?  ఈ రాష్ట్రాలలో దశాబ్దాలుగా అమలులో ఉన్న ఆయిల్ ఫామ్ చెరకు చట్టాలు ఒప్పంద వ్యవసాయ చట్టాలు. అలాగైతే వెంటనే వీటిని రద్దు చేయాలి. కేంద్ర వ్యవసాయ చట్టాలకు ఇవే స్ఫూర్తి’ అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు.
Go Back to Shorts
IYR Krishna Rao
Andhra Pradesh
Telangana
bharat bandh

More Telugu News