అనుకోకుండా భారత సరిహద్దులోకి వచ్చిన పాకిస్థాన్ అమ్మాయిలు
- కశ్మీర్ లోని పూంచ్ సెక్టార్లో ఘటన
- భారత భూభాగంలోకి ప్రవేశించిన పీవోకేకు చెందిన బాలికలు
- మైనర్ బాలికలను అదుపులోకి తీసుకున్న భారత సైన్యం
- పొరబాటున వచ్చారని గుర్తింపు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని అబ్బాస్ పూర్ కు చెందిన ఆ మైనర్లు పూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖ దాటి పొరబాటున భారత భూభాగంలోకి ప్రవేశించారు. ఇద్దరు అమ్మాయిలు ఎల్ఓసీ వెంబడి సంచరిస్తుండడాన్ని గుర్తించిన భారత భద్రతా బలగాలు వెంటనే స్పందించి వారిని అదుపులోకి తీసుకుంది. వారు అనుకోకుండా సరిహద్దులు దాటి ఇవతలికి వచ్చారని తెలుసుకున్న భారత సైన్యం తిరిగి వారిని స్వస్థలాలకు పంపేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు రక్షణ శాఖ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.