ఎన్ కౌంటర్ లో సైకో కిల్లర్ కాల్చివేత... ఐదుగురు పోలీసులకు గాయాలు!
- పలు రాష్ట్రాల్లో వరుస హత్యలు
- ఇటీవల రాట్లంలో కుటుంబం మొత్తాన్ని చంపిన దిలీప్
- పోలీసులు కనిపెట్టిన వేళ ఎదురు కాల్పులు
బాణసంచా పేలుళ్ల శబ్దం మిన్నంటుతుండగా, అతని తుపాకీ కాల్పుల చప్పుళ్లు ఎవరికీ వినిపించలేదు. ఆ కుటుంబాన్ని చంపేసి, దోచుకోవాలన్న ఆలోచనతోనే దివాల్ వచ్చాడని పేర్కొన్న పోలీసులు, అంతకుముందే కొంత భూమిని అమ్మిన సదరు వ్యక్తి, ఇంట్లో డబ్బు దాచి వుంచాడని తెలుసుకున్న నిందితుడు ఈ ఘోరానికి పాల్పడ్డాడని తెలిపారు. అపై అతన్ని నిన్న గుర్తించిన పోలీసులు, లొంగిపోవాలని హెచ్చరించగా, పోలీసులపై కాల్పులకు దిగడంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని ఉన్నతాధికారులు వెల్లడించారు.