ఆత్మాహుతి దాడితో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్థాన్... 30 మంది భద్రతా సిబ్బంది మృతి!
- మరోసారి నెత్తురోడిన ఆఫ్ఘనిస్థాన్
- ఘాజ్నీ నగర శివార్లలో కారుతో ఆత్మాహుతి దాడి
- కారు నిండా పేలుడు పదార్థాలు
దాడిపై ఆఫ్ఘన్ హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందిస్తూ, ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో నింపిన వాహనంతో ఈ దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ దాడికి తమదే బాధ్యత అని ఇంతవరకు ఎవరూ ప్రకటించలేదు. కొన్నిరోజుల కిందటే ఆఫ్ఘనిస్థాన్ లోని బమియాన్ నగరంలో రెండు శక్తిమంతమైన పేలుళ్లు జరిగి 14 మంది మృత్యువాత పడ్డారు.