రెండు గంటల్లో మీ దారుస్సలాంను కూల్చేస్తాం: ఒవైసీకి బండి సంజయ్ సవాల్
- ఎన్టీఆర్, పీవీ ఘాట్లను కూల్చాలన్న అక్బరుద్దీన్ ఒవైసీ
- అవేమైనా నీ అయ్య జాగీరా? అని మండిపడ్డ సంజయ్
- హిందువులు ఓటు బ్యాంకుగా మారితే బీజేపీ గెలుస్తుందని వ్యాఖ్య
తమ మధ్య పొత్తు లేదని ఓటర్లను టీఆర్ఎస్, ఎంఐఎంలు మభ్యపెడుతున్నాయని సంజయ్ విమర్శించారు. ఏమార్చి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎంఐఎం చేస్తున్న సవాళ్లను కూడా టీఆర్ఎస్ నేతలు స్వీకరించడం లేదని అన్నారు. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితే హైదరాబాదులో బీజేపీ గెలుస్తుందని చెప్పారు.