పెళ్లివేడుకలో దొరికిపోయిన 'దొంగ' దంపతులు... చితకబాది పోలీసులకు అప్పగించిన జనాలు!
- కామారెడ్డిలో ఘటన
- బంధువులమంటూ పెళ్లికి వచ్చిన దంపతులు
- వధువు తరపు మహిళ నుంచి బంగారం చోరీ
వచ్చిన దంపతులు ఊరికే ఉండలేదు. పెళ్లికుమార్తె బంధువర్గంలోని ఓ మహిళ నుంచి బంగారు ఆభరణాలు దొంగిలించారు. పెళ్లికి వచ్చిన ఇతరులు వారి నిర్వాకాన్ని గమనించి పట్టుకున్నారు. వారిని సోదా చేయగా మూడు తులాల బంగారం దొరికింది. దాంతో అక్కడున్న వాళ్లు ఆ దొంగ దంపతులను చితకబాదారు. ఆపై పోలీసులకు సమాచారం అందించారు. పరమేశ్, యశోదలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు షురూ చేశారు.