సీబీఐ కోర్టులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్ పై వాదనలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి సీబీఐ కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో జగన్ వేసిన డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు జరిగాయి. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటు నుంచి తన పేరును తొలగించాలని ఆయన డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కు సంబంధించి రేపు కూడా వాదనలు జరగనున్నాయి. మరోవైపు ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి వేసిన డిశ్చార్జ్ పిటిషన్ పై... కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది.


More Telugu News