దుబ్బాక ఉప ఎన్నికలు: చివరి గంటలో కరోనా బాధితులకు ఓటేసే అవకాశం
- దుబ్బాక ఉప ఎన్నికల్లో నేడు పోలింగ్
- ఉత్సాహంగా బూత్ లకు తరలివస్తున్న ఓటర్లు
- 3 గంటల సమయానికి 71.10 శాతం ఓటింగ్
కాగా, దుబ్బాకలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 55.52 శాతం ఓట్లు పోలవగా, 3 గంటల సమయానికి 71.10 శాతం పోలింగ్ జరిగింది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తుండడంతో ఓటింగ్ శాతం అంతకంతకు పెరుగుతోంది. పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.