జగన్ పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలుకు అనుమతి ఇవ్వండి: లాయర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ
- అటార్నీ జనరల్ వేణుగోపాల్ కు లేఖ
- కోర్టులను, జడ్జిలను బెదిరించేలా జగన్ వ్యవహరిస్తున్నారన్న అశ్విని
- జగన్ ప్రవర్తన కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని వ్యాఖ్య
సీజేఐకి జగన్ రాసిన లేఖను బయట పెట్టడం ముమ్మాటికీ కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని లేఖలో ఆయన పేర్కొన్నారు. 31 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి కోర్టులను, జడ్జిలను బెదిరించేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. జగన్ పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని గతంలో ఆయన పిటిషన్ వేశారు.