శాంసంగ్ను అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దిన చైర్మన్ లీ కున్ కన్నుమూత
- 2014 నుంచి హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న లీ
- 1987లో తండ్రి మరణం తర్వాత బాధ్యతల స్వీకరణ
- ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా శాంసంగ్ను తీర్చిదిద్దిన వైనం
లీ 2014లో తొలిసారి గుండెపోటుకు గురయ్యారు. అప్పటి నుంచి హృద్రోగ సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. చైర్మన్ కున్ హీ మృతి బాధాకరమని కంపెనీ తెలిపింది. కొరియాలోని డేగులో 9 జనవరి 1942లో లీ జన్మించారు. శాంసంగ్ వ్యవస్థాపకుడైన తండ్రి లీ బైంగ్ చుల్ మరణం తర్వాత 1987లో లీ శాంసంగ్ బాధ్యతలను చేపట్టి స్మార్ట్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ చిప్స్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో అగ్రగామి సంస్థగా శాంసంగ్ను తీర్చిదిద్దారు.