ఇంద్రకీలాద్రిపై సీఎం జగన్... అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ
- సంప్రదాయ వేషధారణలో సీఎం జగన్
- పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ వర్గాలు
- కొండచరియలు విరిగి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం
- ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు!
కాగా, ఇవాళ ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ తన పర్యటన సందర్భంగా కొండచరియలు విరిగిపడిన ప్రదేశాన్ని పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సందర్భంగా సీఎం జగన్ ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు ప్రకటించారని ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు వెల్లడించారు.