కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం జగన్
- ఇటీవల తీవ్ర వాయుగుండం కారణంగా వర్షాలు
- సీఎం జగన్ ఏరియల్ సర్వే
- వరద పరిస్థితులు సీఎంకు వివరించిన అధికారులు
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాకు కడగండ్లు మిగిల్చింది. అనేక ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించడంతో పంటలు నీట మునిగాయి. రైతాంగం భారీగా నష్టపోయింది. లంక గ్రామాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది.