హరీశ్ రావు తన మంత్రి పదవిని, సిద్ధిపేట టికెట్ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు: జగ్గారెడ్డి
- దుబ్బాక ఉప ఎన్నికల్లో జగ్గారెడ్డి ప్రచారం
- కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించాలని సూచన
- టీఆర్ఎస్ ఓడితే హరీశ్ రావు మంత్రి పదవి పోతుందని వెల్లడి
దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన వేములఘాట్ గ్రామంలో ప్రసంగించారు. వేముల ఘాట్ గ్రామంలో కాంగ్రెస్ కు అత్యధిక మెజారిటీ అందించాలని కోరారు. ప్రజల సమస్యల గురించి నిలదీయాలంటే కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించాలని అన్నారు. మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.