ఫాంలోకి వచ్చిన ధావన్, రాణించిన అయ్యర్... ఢిల్లీ క్యాపిటల్స్ 162/4

Dhawan gets into touch as Delhi posted reasonable score against Mumbai Indians
ఐపీఎల్ నేడు రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ కు అబుదాబి స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ఫాంలోకి రావడం ఢిల్లీకి ఊరట కలిగించే అంశం. ధావన్ 52 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ధావన్ 6 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 33 బంతుల్లో 5 ఫోర్లతో 42 పరుగులు సాధించాడు. ముంబయి బౌలర్లలో కృనాల్ పాండ్య 2, బౌల్ట్ 1 వికెట్ తీశారు.

అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబయి ఇండియన్స్ 6 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 5 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్వింటన్ డికాక్ (38 బ్యాటింగ్), సూర్యకుమార్ యాదవ్ (0 బ్యాటింగ్) బరిలో ఉన్నారు.
Go Back to Shorts
Sikhar Dhawan
Delhi Capitals
Mumbai Indians
IPL 2020

More Telugu News