బాబ్రీ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తాం: ముస్లిం లాబోర్డు
- కోర్టు తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్ర అసంతృప్తి
- వందలాదిమంది ఇచ్చిన సాక్ష్యాలను కోర్టు పట్టించుకోలేదన్న జిలానీ
- ఇతర ముస్లిం సంస్థలతో కలిసి హైకోర్టుకు
నిందితులు స్టేజిపై నుంచి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, ఐపీఎస్ అధికారులు, జర్నలిస్టులు ఈ విషయంలో సాక్ష్యం కూడా ఇచ్చారని పేర్కొన్నారు. వందలాదిమంది ఇచ్చిన సాక్ష్యాలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. బాబ్రీ కూల్చివేత ముందస్తు పథకం ప్రకారం జరగలేదని కోర్టు పేర్కొనడాన్ని జిలానీ తప్పుబట్టారు.
దేశమొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన బాబ్రీ కేసులో తీర్పు నిన్న వెల్లడైంది. ఈ కేసులో బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి సహా 32 మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.