అన్యమతస్థుల డిక్లరేషన్ లో జగన్ ఎందుకు సంతకం చేయలేదు?: ఎంపీ రఘురాజు
- సంతకం అవసరం లేదన్న టీటీడీ ఛైర్మన్ పై చర్యలు తీసుకోవాలి
- దేవుడి సొమ్మును దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి
- హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దు
డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన టీటీడీ ఛైర్మన్ పై చర్యలు తీసుకోవాలని రఘురాజు డిమాండ్ చేశారు. తిరుమల ఆలయ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దేవుడి సొమ్మును దోచుకునే ప్రయత్నం జరుగుతోందని... ప్రభుత్వ బాండ్లలో టీటీడీ నిధులను ఇన్వెస్ట్ చేయడం సరికాదని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయవద్దని కోరారు. న్యాయవ్యవస్థను కించపరిచేలా వైసీపీ ఎంపీలు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. తనకు వస్తున్న బెదిరింపులు, కేసులు, అనర్హత వేటుకు సంబంధించి ప్రధాని మోదీకి లేఖ ద్వారా తెలియజేశానని చెప్పారు.