కంగనా రనౌత్ కు అపాయింట్మెంట్ ఇచ్చిన మహారాష్ట్ర గవర్నర్!
- మహారాష్ట్ర ప్రభుత్వంతో వివాదానికి దిగిన కంగన
- నేటి సాయంత్రం గవర్నర్ తో భేటీ
- ఉద్ధవ్ సర్కారుపై ఫిర్యాదు చేయనున్న హీరోయిన్
ఈ నేపథ్యంలో బీజేపీ కంగనకు అండగా నిలిచిందన్న సంగతి తెలిసిందే. ముంబైలో కంగన అడుగు పెట్టేందుకు భారీ భద్రతను కూడా కల్పించింది. తాజాగా, ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ కూడా ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చారు.నేటి సాయంత్రం కంగన స్వయంగా వెళ్లి గవర్నర్ తో భేటీ కానుంది. తనకు జరిగిన అన్యాయం, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వ వైఖరి గురించి ఆమె గవర్నర్ కు ఫిర్యాదు చేయనుందని సమాచారం.