అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దు: ఏపీ మంత్రి కొడాలి నాని
- పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు
- జగన్ సైతం ఈ డిమాండ్ ను పరిశీలిస్తానని చెప్పారు
- మీడియాతో కొడాలి నాని
తన వాదనను విన్న తరువాత, సీఎం సైతం ఈ విషయాన్ని పరిశీలిస్తానని తెలిపారని, పలువురు ఇతర నేతలు, అమరావతి ప్రాంత పేదలను సంప్రదించిన తరువాతనే తాను శాసన రాజధానిని కూడా ఈ ప్రాంతం నుంచి తొలగించాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చానని అన్నారు. కనీసం తమ పార్టీ నేత లోకేశ్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయిన తెలుగుదేశం పార్టీకి ఈ విషయంలో వాదించే అర్హత కూడా లేదని అన్నారు.