ఆసుపత్రిలో పెళ్లి రోజు జరుపుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం!
- ఐసీయూలో కేక్ కట్చేసి సెలబ్రేట్ చేసుకున్న బాలు దంపతులు!
- నిర్ధారించని ఆసుపత్రి వర్గాలు
- నేడు శుభవార్త వింటారన్న ఎస్పీ చరణ్
కరోనా బారినపడిన బాలసుబ్రహ్మణ్యం గత నెల 5న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం విషమించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో వెంటిలేటర్పై ఉంచి, ఎక్మో సాయంతో చికిత్స చేశారు. దీంతో ఆయన ఆరోగ్యం కొంత కుదుటపడింది. ఇటీవల చరణ్ మాట్లాడుతూ.. సోమవారం ఓ శుభవార్త వినబోతున్నారని పేర్కొన్నారు.