'ఉచిత్ విద్యుత్-నగదు బదిలీ'కి ఏపీ కేబినెట్ ఆమోదం
- సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం
- ఉచిత విద్యుత్ కు నగదు బదిలీపై చర్చ
- రైతులపై ఒక్క పైసా భారం పడదన్న సీఎం
అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షనను క్రమబద్ధీకరిస్తామని, కనెక్షన్ల తొలగింపు ఉండదని భరోసా ఇచ్చారు. కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి పేరుతో కొత్తగా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి, ఆ ఖాతాలోకి నేరుగా నగదు జమ చేస్తామని, ఆ డబ్బునే డిస్కంలకు చెల్లించడం జరుగుతుందని వివరించారు.
మొదట శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని, అనంతరం ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ నూతన విధానం అమలవుతుందని సీఎం జగన్ చెప్పారు. మరో 35 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా ఉండబోదని అన్నారు. ఉచిత విద్యుత్ పేటెంట్ ఒక్క వైఎస్సార్ కు మాత్రమే దక్కుతుందని ఆయన ఉద్ఘాటించారు.