ఏపీ మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కు కరోనా పాజిటివ్
- శ్రవణ్ కు కరోనా సోకిన విషయం వెల్లడించిన లోకేశ్
- ఇప్పటికే బుద్ధా వెంకన్నకు పాజిటివ్
- ఇద్దరూ త్వరగా కోలుకోవాలంటూ లోకేశ్ ట్వీట్
గతంలో కిడారి శ్రవణ్ అనూహ్యరీతిలో మంత్రి కావడం తెలిసిందే. ఆయన తండ్రి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోలు హత్యచేయడంతో టీడీపీ అధినాయకత్వం ఆయన తనయుడు కిడారి శ్రవణ్ కు మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించింది. అయితే, ఆయన పదవిని చేపట్టిన ఆరు నెలల లోపు చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉండగా, ఆ గడువు ముగిసిపోవడంతో కిడారి పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు రాజీనామా చేశారు.