కంగనా ప్రత్యేక అజెండాతో వెళుతోంది: సుశాంత్ కుటుంబ న్యాయవాది వికాస్ సింగ్
- సుశాంత్ మరణం తర్వాత రెచ్చిపోయిన కంగనా రనౌత్
- బాలీవుడ్ లో బంధుప్రీతి ఉందంటూ వ్యాఖ్యలు
- సుశాంత్ కేసులో బంధుప్రీతికి ప్రాధాన్యత లేదన్న కుటుంబ న్యాయవాది
సుశాంత్ మరణం తర్వాత కంగనా రనౌత్ తన వ్యక్తిగత అజెండాతో ముందుకు పోతోందని, తనను ఇబ్బందులకు గురిచేసిన వారిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తోందని తెలిపారు. బాలీవుడ్ లో బంధుప్రీతి కొత్తకాదని, సుశాంత్ వ్యవహారానికి బంధుప్రీతి అంశానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. బంధుప్రీతి కారణంగా సుశాంత్ కొన్ని ఇబ్బందులు పడి ఉండొచ్చు కానీ, ఈ కేసులో ఆ అంశానికి ప్రాధాన్యత లేదని వివరించారు. కానీ కంగనా తన సొంతదారిలో వెళుతోందని అన్నారు.